తిరువనంతపురం, జనవరి 14: హరిహరసుతుని దర్శనం చేసుకునేందుకు లక్షలాది మంది భక్తులు శబరిమల వైపు వివిధ ప్రాంతాల నుండి కదలి వచ్చారు. ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేసారు. దివ్య దర్శనం సుమారు సాయంత్రం గం 6.45 ని|| వరకు ముమ్మారు సార్లు భక్తులకు కనువిఉందు చేసింది. భక్తుల కోసం ప్రభుత్వం వ్యూ పాయింట్లు ఏర్పాటు చేసింది. దేవభూమి కేరళ పలు రాష్ట్రాల భక్తులతో కిటకిటలాడింది. మకరజ్యోతి, మణికంఠ అంటూ.. భక్తులు హర్షద్వానాలు చేసారు. శరణుఘోషతో పోటెత్తిన శబరీగిరులు. అయ్యా అనగా.. విష్ణువు – అప్ప అనగా.. శివుడు అని అర్ధం. జ్యోతిని దర్శించుకునే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసు కోకుండా అక్కడి ప్రభుతం చర్యలు తీసుకుంది.










