సికింద్రాబాద్, జనవరి 14: పరేడ్ గ్రౌండ్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఈ కైట్ ఫెస్టివల్లో ఇండోనేషియా, ఆస్ట్రేలియా వంటి 19 దేశాల నుంచి 47 మంది కైట్ ఫ్లైయర్స్ పాల్గొననున్నారు. 14 రాష్ట్రాల నుంచి దాదాపు 54 మంది నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లయర్స్ పాల్గొంటారని తెలుస్తోంది. జనవరి 15 వరకు మూడు రోజుల పాటు జరగనున్న కైట్ ఫెస్టివల్లో మంగళవారం అనేక మంది వచ్చి పతంగులు ఎగురవేశారు.










