న్యూఢిల్లీ, జనవరి 13: భారత్లో హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా మరోచిన్నారి ఈ వైరస్ బారిన పడింది. పుదుచ్ఛేరికి చెందిన చిన్నారికి హెచ్ఎమ్పీవీ వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఆరోగ్య శాఖ అధికారి రవిచంద్రన్ తెలిపిన వివరాల ప్రకారం.. సదరు చిన్నారి జ్వరం, దగ్గు, జలుబుతో ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్లో చేరినట్లు తెలిపారు.
ప్రస్తుతం చిన్నారి వైద్య చికిత్సకు సహకరిస్తోందని చెప్పారు. కాగా, తాజా కేసుతో పుదుచ్ఛేరిలో హెచ్ఎమ్పీవీ కేసులు రెండుకు చేరాయి. గతవారం మూడేండ్ల చిన్నారి ఈ వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. చికిత్స తర్వాత పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యింది. తాజా కేసుతో కలిపి భారత్లో హెచ్ఎమ్పీవీ కేసులు 18కి చేరాయి.