తొలిరోజే మహాకుంభమేళాలో కోటిన్నరమంది పుణ్యస్నానాలు

ప్రయాగ్‌రాజ్‌, జనవరి 13: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగ్‌రాజ్‌ లో ప్రారంభమైన మహా కుంభమేళా కు తొలిరోజే భక్తులు పోటెత్తారు. గంగ, యమున, సరస్వతీ నదుల సంగమంలో 1.50 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేశారు. సోమవారంనాడు పుష్య పౌర్ణమి సందర్భంగా బీహార్‌, హర్యానా, బెంగాల్‌, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ సహా పలు రాష్టాల్ర నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో వివిధ ఘాట్లు కిటకిలలాడాయి. మహాకుంభమేళా వేలాదిగా తరలి వస్తున్న భక్తులకు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అభినందనలు తెలిపారు. పుష్పమాస పౌర్ణమి రోజున త్రివేణి సంఘంలో పవిత్ర స్నానాల కోసం విచ్చేసి సాధువులు, కల్పవాసీలు, భక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

‘మహా కుంభమేళా తొలిరోజు సనాతన ధర్మాన్ని ఆచరించే 1.50 కోట్ల మంది స్వచ్ఛమైన త్రివేణీ జలాల్లో పవిత్ర స్నానాలు చేయడం ద్వారా ఈ పండుగను విజయవంతం చేశారు. ఇందుకు సహకరించిన మహాకుంభ మేళా అడ్మినిస్టేష్రన్‌, ప్రయాగ్‌రాజ్‌ అడ్మినిస్టేష్రన్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రయాగరాజ్‌, స్వచ్ఛాగ్రహీలు, గంగా సేవాదూత్‌లు, కుంభ్‌ సేవక్లు, మత-సామాజిక సంస్థలు, వివిధ వాలంటీర్లు, మిత్రులు, విూడియా ప్రపంచం సహా మహాకుంభ్‌తో మమేకమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను‘ అని యోగి పేర్కొన్నారు. ’మహాకుంభ్‌’ భిన్నత్వంలో ఏకత్వం సందేశాన్ని చాటుతూ భిన్న సంస్కృతులను ఏకం చేస్తోందని యోగి ఆదిత్యనాథ్‌ ఒక ట్వీట్‌లో అభివర్ణించారు.

సాంస్కృతీ సమ్మేళనం ఎక్కడుంటుందో విశ్వాసం, సామరస్యం అక్కడే ఉంటుందన్నారు. ప్రయోగ్‌రాజ్‌ సనాతన ధర్మానికి ప్రతీకగా నిలుస్తోందని చెప్పారు. కాగా, తెల్లవారుజాము నుంచి దట్టమైన పొగమంచు, తీవ్రమైన చలిగాలులు ఉన్నప్పటికీ లెక్కచేయకుండా వేలాది మంది భక్తులు త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలకు ఎంతో ఉత్సాహంగా తరలివచ్చారు. వయోభేదం లేకుండా అన్ని రంగాలకు చెందిన ప్రజలు పవిత్ర స్నానాలతో పులకించిపోయారు. భజనలు, జై గంగా మయ్యా నినాదాలు మధ్య ’మహాకుంభ్‌’ అంగరంగ వైభవంగా మొదలైంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News