నిజామాబాద్, జనవరి 11: రోజులు మారుతున్న కొద్దీ.. జనం ప్లలెలు వదిలి పట్నాలకు వలస వస్తున్నారు. అరకొర ఉపాధి దొరికి కొంత ఊరట కలిగినప్పటికీ సొంతూళ్లను మిస్ అవుతున్న ఫీలింగ్ ఏదో మూలన ఉండక మానదు. అందుకే పండగలు, పబ్బాలు వచ్చిన్పప్పుడు సొంతూళ్లకు వెళుతుంటారు.. దసరా, సంక్రాంతి, దీపావళి పండుగలను ఉళ్లకు వెళ్లి జోరుగా జరుపు కుం టారు. ముఖ్యంగా సంక్రాంతి లాంటి పెద్ద పండగ వచ్చిన ప్రతీసారి అటు ఏపీ ప్రజలు ఇటు తెలంగాణ ప్రజలు సొంతూళ్ల బాట పడతారు. గత పల్లె జ్ణాపకాలను నెమరు వేసుకుంటుంటారు. చరిత్ర పుస్తకాల్లో చదివేది కాదు మన జీవితాలకి మూలం అని తెలియాలంటే ఊరికి దగ్గరలో ఉన్న పాత గడీ, కోటగోడ, పాతగుడి లాంటివి.
మనం చిన్న నాడు చదువుకున్న స్కూల్, ఈతకొట్టిన పెద్ద బావి లాంటి ప్రదేశాలన్నీ పిల్లలతో కలసి ఎంజాయ్ చేయాలని ఉంటుంది. పెంకుటిళ్ళూ, మట్టిగోడలూ దాటుతున్నప్పుడూ వాటివిూద దృష్టి పడేలా చెయ్యండి. ఒకప్పుడు మనం తిరిగిన ప్లలె ఎలా మారిపోతోందో ఒకసారి గుర్తు చేసుకోవాలని ఎవరికి ఉండదు. అప్పుడప్పుడూ ఆ రోజుల్లోకి వెళ్ళిపోవటం ఇప్పుడు వినటానికి చికాకుగా ఉన్నా గుర్తు చేసుకున్నప్పుడు బాగుంటుంది….. అదే కాదు ఒక్కసారి పిల్లలకి ఇవన్నీ చూపించాక వాళ్ళ ఆలోచనా తీరు ఎలా మారిపోతుందో గమనించొచ్చు.