- గత పాలనలో అన్ని రంగాల్లో పతనావస్థ
- రాష్టాన్న్రి సమస్యల వలయంగా మార్చేశారు
- బ్రాండ్ ఎపికి మళ్లీ మహర్దశ పట్టిస్తున్నాం
- నిర్మాణరంగానికి ప్రత్యేక ప్రోత్సాహం
గుంటూరు, జనవరి 10: గత పాలకులు అన్ని రంగాలనూ పతనావస్థకు తీసుకొచ్చారని.. రాష్టాన్న్రి సమస్యల వలయంగా మార్చేశారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. పడకేసిన నిర్మాణ రంగాన్ని మళ్లీ పైకి తీసుకొస్తామన్నారు. గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య మైదానంలో నరెడ్కో ప్రాపర్టీ షోను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘కొత్త ఏడాది నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా. గత ప్రభుత్వ హయాంలో ఈ రంగం అధ్వానంగా మారింది. ప్రజలు మమ్మల్ని నమ్మి 93శాతం స్టయ్రిక్ రేట్తో విజయం కట్టబెట్టారు. అధికారంలోకి రాగానే రాష్ట్ర పునర్ నిర్మాణం ప్రారంభించాం. ప్రధాని మోదీ విశాఖకు వచ్చి రూ.2లక్షల కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే ముందుకెళ్తోంది. నిర్మాణ రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాం. ఈ రంగంపై 34లక్షల మంది ఆధారపడి ఉన్నారు. ఉచిత ఇసుక విధానం తెచ్చి నిర్మాణ రంగానికి ఊతమిచ్చాం.
నరెడ్కో, క్రెడాయ్ వంటి సంస్థలు కలిసి ముందుకు రావాలి. రియల్ ఎస్టేట్ సమస్యల పరిష్కారానికి ముందుంటాం. వైకాపా పాలనలో అన్నింటికంటే ఎక్కువగా నిర్మాణ రంగం దెబ్బతింది. అధికారంలోకి రాగానే ఈ రంగానికి ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. ఎప్పుడూ చూడనివిధంగా భూ సమస్యలపై దరఖాస్తులు వస్తున్నాయి. వైకాపా ప్రభుత్వం చేసిన అక్రమాలే దీనికి ముఖ్య కారణం. భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వ నిర్వాకంతో టీడీఆర్ బాండ్లు తీసుకుని కొంతమంది నష్టపోయారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ సాధన కోసం కృషి చేస్తున్నాం. మేం వచ్చాక రూ.4లక్షల కోట్ల పెట్టుబడులకు సంతకాలు చేశాం. ఐదేళ్లలో 20లక్షల మందికి ఉపాధి కల్పించాలనేదే మా లక్ష్యం‘ అని చంద్రబాబు అన్నారు. ఉచిత ఇసుకతో నిర్మాణ రంగానికి ఊతమిచ్చామన్నారు. నిర్మాణ రంగం నిరంతరం జరిగే పక్రియ అని సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. నరెడ్కో, క్రెడాయ్ వంటి సంస్థలు ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపు నిచ్చారు.
రియల్ ఎస్టేట్ రంగంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. వైసీపీ పాలనలో నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. నిర్మాణ రంగానికి తాము ఊతమిచ్చామని ఆయన వివరించారు. శుక్రవారం గుంటూరులో నరెడ్కో ప్రాపర్టీ షోను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో అన్ని రంగాలు పతనావస్థకు చేరాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్టాన్ని సమస్యల వలయంగా మార్చేశారంటూ గత ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పడకేసిన నిర్మాణ రంగాన్ని మళ్లీ పైకి తీసుకురావాల్సి ఉందన్నారు. కొత్త ఏడాదిలో నిర్మాణ రంగం అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణ రంగం అధ్వానంగా ఉందని గుర్తు చేశారు. ప్రజలు తమను నమ్మి 93 శాతం స్టైక్ర్ రేట్తో భారీ విజయం కట్టబెట్టారన్నారు. అధికారంలోకి రాగానే రాష్ట్ర పునర్ నిర్మాణాన్ని ప్రారంభించామని ఆయన స్పష్టం చేశారు.
అందులోభాగంగా రూ. 2 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ.. తాజాగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారని చెప్పారు. బ్రాండ్ ఏపీ ఇప్పుడిప్పుడే ముందుకెళ్తోందన్నారు. బ్రాండ్ ఏపీ ఇప్పుడిప్పుడే ముందుకెళ్తోందన్నారు. భూ కబ్జాకారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా భూ సమస్యల దరఖాస్తులు తమకు వస్తున్నాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలే భూ సమస్యలకు ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. వైసీపీ నిర్వాకంతో టీడీఆర్ బాండ్లు తీసుకుని నష్టపోయారన్నారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంటు సాధన కోసం కృషి చేస్తున్నామని వివరించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత.. 4 లక్షల కోట్ల పెట్టుబడులకు సంతకాలు చేశామన్నారు. ఈ ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.