- క్రీడాభివృద్ధికి సహకారం అందిస్తానని హావిూ
హైదరాబాద్, జనవరి 08: సిఎం రేవంత్ రెడ్డిని ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. స్పోర్ట్పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని గోపీచంద్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. స్పోర్ట్ యూనివర్సిటీ, స్పోర్ట్ అకాడవిూ ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం శుభ పరిణామని గోపీచంద్ అభిప్రాయపడ్డారు. క్రీడాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని గోపీచంద్ తెలిపారు.