టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. వాడెవడో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే దొంగ (పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పాత్ర).. వాడు హీరో.. ప్రస్తుతం హీరోల్లో అర్థాలు మారిపోయాయి.. నాకున్న అదృష్టం ఏంటంటే 48 సంవత్సరాలుగా నేను సమాజంలో మన చుట్టూ ఉన్న ట్వంటి పాత్రలతో డిఫరెంట్ హీరో అనిపించుకున్నా.. అంటూ కామెంట్ చేశాడు. అయితే నటకిరీటి చేసిన వ్యాఖ్యలు ముదరడంతో తర్వాత క్లారిటీ ఇచ్చాడు.
తాను అల్లు అర్జున్ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని తెలిపాడు. అల్లు అర్జున్ నా కొడుకు లాంటి వాడు. అతడిని అలా అంటానా. అంటూ రాజేంద్రప్రసాద్ తెలిపాడు. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది. ఇదిలావుంటే.. ఈ విషయంపై మరోసారి స్పందించాడు రాజేంద్రప్రసాద్. ఈ విషయంపై నేను ఇటీవల అల్లు అర్జున్ని కలిశాను. అయితే బన్నీ మాట్లాడుతూ.. మీరు ఆ మాటలు అనలేదని నాకు తెలుసు అన్నాడు. పిచ్చోడా నేనే అన్నాను అని చెప్పాను. దానికి బన్నీ మీరు అన్నది తెలుసు. కానీ మీరు వేరే ఉద్దేశ్యంతో అనలేదు అని తెలిపాడు. సరిగ్గా చెప్పావు. నా ఉద్దేశ్యం అది కాదు. ఇప్పుడు సోషల్ మీడియా ఎలా తయారయ్యింది అంటే.. నేను నాకు తెలిసిన ఒక మీడియా మిత్రుడిని అడిగాను. నేను మాట్లాడింది ఒకటి అయితే నువ్వు టైటిల్ వేరే ఎందుకు పెట్టావు అని నిలదీయగా.. వాడు అలా ధంబ్నెల్స్ లేకపోతే ఎవరు చూడట్లేదని తెలిపాడు. దీంతో నేను షాక్ అయ్యాను. ఇలా చేయడం వలన తెలికుండానే నెగిటివ్గా పోతున్నాయి. అంటూ రాజేంద్ర ప్రసాద్ చెప్పుకోచ్చాడు.