ఆ సన్నివేశాలను తొలగించండి.. కోర్టును ఆశ్రయించిన కన్నడ భామ

అభిమన్యు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కన్నడ భామ రమ్య. ఈ మాజీ మైసూరు ఎంపీ తాజాగా కోర్టును ఆశ్రయించింది. 2023లో రిలీజైన కన్నడ కామెడీ డ్రామా. రమ్య కామియో రోల్‌లో మెరిసింది. అయితే తన అనుమతి లేకుండా ఈ సినిమాలో ఉపయోగించిన సీన్లను తొలగించాలని నిర్మాతలను కోరుతూ బెంగళూరులోని కమర్షియల్‌ కోర్టు కాంప్లెక్స్‌ను ఆశ్రయించింది. ట్రైలర్‌తోపాటు సినిమాలోని పుటేజీలో కొన్ని సన్నివేశాలను తన ప్రమేయం లేకుండా వాడారని రమ్య ఫిర్యాదులో పేర్కొన్నది.

నిర్మాతలు అనుమతి లేకుండా వాడిన తన వీడియోలను తొలగించడమే కాకుండా.. తనకు కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. ఈ విషయమై నిర్మాతలకు పలుమార్లు విజ్ఞప్తి చేసిన తన సీన్లు తొలగించడం, ఎలాంటి యాక్షన్‌ తీసుకోవడం కానీ చేయలేదని రమ్య ఆరోపించింది. సినిమాలోని తన సన్నివేశాలను తొలగిస్తే కేసును వెనక్కి తీసుకుంటానని కూడా రమ్య చెప్పినట్టు ఇండస్ట్రీ సర్కిల్‌ టాక్‌. మరి రమ్య వ్యవహరంపై నిర్మాతలు ఎలా స్పందిస్తారనేది తెలియాల్సి ఉంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News