- స్పోర్ట్స్ వర్సిటీతో అభివృద్దికి యత్నం
- ప్రపంచ దేశాల్లో నైపుణ్యాల పరిశీలన
- సింగపూర్ పర్యటనలో అధ్యయనం చేయనున్న రేవంత్
హైదరాబాద్, జనవరి 07: తెలంగాణ రాష్ట్రం క్రీడా రంగంలో కీలకమైన అడుగులు వేయబోతోంది. క్రీడా వర్సిటీ కోసం చేస్తున్న యత్నాలు ఫలిస్తే తెలంగాణ క్రీడారంగంలో దూసుకుపోవడం ఖాయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడాభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తూ, దేశంలోని అత్యంత ఆధునిక స్థాయిలో లక్ష మంది కూర్చునే సామర్థ్యం కలిగిన భారీ స్టేడియాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఫ్యూచర్సిటీలో లేదా మరో ప్రాంతంలో 100 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ స్టేడియంలో అత్యాధునిక సాంకేతికతతో క్రికెట్, ఫుట్బాల్ వంటి వివిధ క్రీడలకు అనువైన మైదానాలను రూపొందిస్తారు. రాష్ట్రంలోని క్రీడాకారులకు ప్రపంచ స్థాయి శిక్షణ, మౌలిక సదుపాయాలు అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణను క్రీడల కేంద్రంగా మార్చాలన్నది సీఎం రేవంత్ రెడ్డి దృష్టిగా ఉంది. దీనికి సంబంధించిన ప్లానింగ్ వంటి అంశాలపై అధ్యయనం చేస్తారు.
18న సింగపూర్ లో పర్యటించనున్న సీఎం, అక్కడి మల్టీ-యూజ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, ట్రాఫిక్ నిర్వహణ పద్ధతులు, క్రీడా మైదానాల నిర్వహణపై అవగాహన పెంపొందించుకుంటారు. సింగపూర్లో చిన్న దేశంగా ఉన్నప్పటికీ, ఒలింపిక్స్ మెడల్స్ సాధించడంలో తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను పరిశీలిస్తారు. ప్రస్తుతం గుజరాత్లోని మోతేరా స్టేడియం దేశంలోనే అతిపెద్దది, 1.32 లక్షల మంది సామర్థ్యంతో ఉంది. తెలంగాణలో నిర్మించబోయే ఈ కొత్త స్టేడియం గుజరాత్ స్థాయికి తగ్గదిగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మైదానం అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్లు, ఐపీఎల్ మ్యాచ్లకు కేంద్రంగా మారుతుందని అంచనా.క్రీడాభివృద్ధిపై మరింత అవగాహన పొందేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 15, 16 తేదీల్లో ఆస్టేల్రియా పర్యటనకు సిద్ధమవుతున్నారు. అక్కడి క్రీడా మైదానాలు, శిక్షణా విధానాలు, ప్లానింగ్ వంటి అంశాలపై అధ్యయనం చేస్తారు. 18న సింగపూర్ లో పర్యటించనున్న సీఎం, అక్కడి మల్టీ-యూజ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, ట్రాఫిక్ నిర్వహణ పద్ధతులు, క్రీడా మైదానాల నిర్వహణపై అవగాహన పెంపొందించుకుంటారు.
సింగపూర్లో చిన్న దేశంగా ఉన్నప్పటికీ, ఒలింపిక్స్ మెడల్స్ సాధించడంలో తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను పరిశీలిస్తారు. తెలంగాణలో ఇప్పటికే 760 ఎకరాల్లో స్పోర్ట్స్ హబ్ను ఏర్పాటు చేశారు. దీనికి తోడు ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్ రాష్ట్ర క్రీడారంగానికి దిశానిర్దేశర చేయనుంది. క్రీడలకు సంబంధించిన ప్రణాళికలు, క్రీడాకారులకు అవసరమైన సదుపాయాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తూ, సమగ్ర విధానం అమలులోకి తెచ్చే యోచనలో ఉంది.20-24 తేదీల్లో స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులపై కూడా చర్చించనున్నారు. తెలంగాణ క్రీడా రంగానికి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ అయిన ఈ స్టేడియం, రాష్టాన్న్రి క్రీడా భవిష్యత్తు కేంద్రంగా మార్చేందుకు సహాయపడుతుదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.