చైనా జలఖడ్గంపై దృష్టి పెట్టాల్సిందే!

చైనా ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తూనే ఉంటుంది. పొరుగు దేశాలను గుప్పిట్లో ఉంచుకోవడం, ఎదుగుతున్న దేశాలకు ఎసరు పెట్టడం దాని లక్ష్యంగా ఉంది. కరోనాతో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన చైనా తన మనుగడ, పెత్తనం కోసం ఎంతకైనా తెగిస్తుందని రుజువు చేసింది. తాజాగా హెచ్‌ఎంపివి వైరస్‌ కూడా ఇలాంటిదే. కరోనా సమయంలోనూ తమకు సంబంధం లేదని బుకాయించింది. అలాగే ఇప్పుడీ కొత్త వైరస్‌పైనా ప్రపంచాన్ని బుకాయిస్తోంది. ఎలాంటి ప్రాణాంతకం కాదని చెబుతోంది. చైనా తన మార్కెట్‌ పరిధిని పెంచుకునే ప్రయత్నంలో ఎలాంటి దురాగతాలకైనా పాల్పడుతుందనడానికి ఇవి నిదర్శనాలు. ఇకపోతే ఇప్పుడు చైనాతో అతిపెద్ద ముప్పు ఏర్పడబోతోంది. భారత్‌, నేపాల్‌లతో చైనా తన సరిహద్దుల ముక్కోణపు కూడలికి బాగా దగ్గరగా యార్లుంగ్‌ జాంగ్బో నదిపైన, గంగా ఉపనదిపైన టిబెట్‌లో కొత్త డ్యామ్‌ను నిర్మిస్తున్నదని వార్తలు వచ్చాయి. ఈ వార్త కొన్ని సంవత్సరాలుగా వివిధ వార్తా పత్రికల్లో ప్రచురితమైంది.

నిజానికి ఈ డ్యామ్‌ నిర్మాణం జరిగితే భారత్‌ భద్రతకు తీవ్ర ముప్పు ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో అలాంటిదేవిూ లేదని తాజాగ ఆచైనా ప్రకటించింది. దీంతో భారత్‌కు ఎలాంటి ఉపద్రవం రాదని న మ్మబలికింది. చైనా ప్రభుత్వం బ్రహ్మపుత్రకు టిబెట్‌ పేరు అయిన యార్లుంగ్‌ జాంగ్బో నది దిగువ పరివాహక ప్రాంతాల్లో ఒక జలవిద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆమోదించింది. జల విద్యుత్‌ ప్రాజెక్టు యార్లుంగ్‌ జాంగ్బో నది దిగువ పరివాహక ప్రాంతంలో ఉంటుంది. హిమాలయ ప్రాంతంలో ప్రధాన ఇరుకైన లోయలో డ్యామ్‌ నిర్మాణం జరుగుతుంది. అక్కడ నది నాటకీయంగా మలుపు తీసుకుని అరుణాచల్‌ ప్రదేశ్‌లోకి ప్రవహించి, చివరగా బంగ్లాదేశ్‌కు చేరుకుంటుంది. ఆ డ్యామ్‌ చైనాకు నదీ ప్రవాహంపై నియంత్రణాధికారం కల్పిస్తుందని, ప్రాజెక్టు స్థాయి కారణంగా సరిహద్దు ప్రాంతాలను వరదల్లో ముంచెత్తేందుకు అవకాశం ఇస్తూ, సంక్షోభ సమయాల్లో అధిక మొత్తంలో నీటి విడుదలకు వీలు కల్పిస్తుందని భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

కానీ, బ్రహ్మపుత్ర నదిపై చైనా భాగంలో డ్యామ్‌ నిర్మాణాన్ని ఆమోదించాలన్న తన నిర్ణయాన్ని చైనా సమర్థించుకున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్‌ను టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించాలన్న చైనా యోచనపై భయాందోళనలు అనవసరమని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మావో నింగ్‌ డిసెంబర్‌ 27న అన్నారు.మెగా ప్రాజెక్టు దిగువ నదీ పరివాహక దేశాలను ప్రభావితం చేయదని, దశాబ్దాల తరబడి అధ్యయనాల ద్వారా వాటి భద్రత ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని సరి చేయడమైందని మావో నింగ్‌ స్పష్టం చేశారు, 137 బిలియన్‌ డాలర్ల ప్రాజెక్టును టెక్టోనిక్‌ ప్లేట్‌ సరిహద్దు పొడుగునా పర్యావరణపరంగా సున్నితమైన హిమాలయ ప్రాంతంలో నిర్మిస్తున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద డ్యామ్‌ ప్రభావం పల్లపు ప్రాంతాలపై పడదని ఆమె చెప్పారు. ఆ డ్యామ్‌ను ఉపగ్రహ చిత్రాల ఆధారంగా దిగువ ప్రాంతాలకు నీటి ప్రవాహం నియంత్రణ కు చైనా ఉపయోగించుకోవచ్చు.

చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని జిన్‌హువా వార్తా సంస్థ ఉటంకించిన అధికార ప్రకటన ప్రకారం, తుదకు 2024 డిసెంబర్‌ 25న అన్ని సందేహాలను పరిహరిస్తూ వెలువరించింది. ఇప్పుడు భారత్‌ అభ్యంతరం చెప్పడంతో అంతగా భయపడాల్సిన అవసరం లేదని అంటోంది. సీమాంతర నదుల అభివృద్ధి పట్ల చైనా ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా ఉంటున్నట్లు, టిబెట్‌లో జలవిద్యుత్‌ అభివృద్ధిపై దశాబ్దాల పాటు అధ్యయనం చేసినట్లు, ప్రాజెక్టు భద్రతకు, పర్యావరణ, వాతావరణ పరిరక్షణకు సముచిత చర్యలు తీసుకున్నట్లు మావో నింగ్‌ చెబుతున్నా నమ్మశక్యంగా లేవు. భారత సరిహద్దుకు సవిూపంగా టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిపై 137 బిలియన్‌ యుఎస్‌ డాలర్లు విలువ చేసే భూగ్రహంపై అతిపెద్ద మౌలిక వసతుల ప్రాజెక్టుగా పేర్కొంటున్న ప్రపంచంలోనే ప్రతిపాదిత అతిపెద్ద డ్యామ్‌ నదీ పరివాహక దేశాలు భారత్‌, బంగ్లాదేశ్‌లలో ఆందోళనలు కలిగిస్తోంది.

డ్యామ్‌పై మొత్తం పెట్టుబడి ఒక ట్రిలియన్‌ యువాన్లు (137 బిలియన్‌ డాలర్లు) దాటిపోగలదు. ప్రపంచంలోనే అతిపెద్దదిగా పరిగణిస్తున్న చైనా సొంత త్రీ గాడ్జెస్‌ డ్యామ్‌ సహా ఈ గ్రహంపై ఏ ఇతర ఒక్క మౌలికవసతుల ప్రాజెక్టు ఖర్చును మరుగుజ్జును చేస్తుంది. హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక భారీ లోయలో డ్యామ్‌ను నిర్మించడమన్నది పొరుగున ఉన్న మనపై జలయుద్ద ట్యాంకును ఎక్కు పెట్టడమే. కైలాస శిఖరం నుంచి టిబెట్‌ విూదుగా భారత్‌, బంగ్లాదేశ్‌లకు పేర్ల మార్పుతో ప్రవహిస్తున్న నదిపై మెగా డ్యామ్‌ల నిర్మాణం గురించి పోటాపోటీగా వ్యవహరిస్తున్నా రెండు దేశాలు సీమాంతర నదులకు సంబంధించిన వివిధ అంశాలను చర్చించేందుకు 2006లో నిపుణుల స్థాయి యంత్రాంగం ను ఏర్పాటు చేశాయి. దాని కింద వరద కాలాల్లో బ్రహ్మపుత్ర నది, స్లటెజ్‌ నదికి సంబంధించి జలప్రవాహ సమాచారాన్ని భారత్‌కు చైనా అందజేస్తున్నది.

సరిహద్దు అంశానికి సంబంధించి భారత, చైనా ప్రత్యేక ప్రతినిధులు ఎన్‌ఎస్‌ఎ అజిత్‌ దోవల్‌, చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్‌ యి మధ్య డిసెంబర్‌ 18న బీజింగ్‌లో జరిగిన చర్చల్లో సీమాంతర నదుల డేటా పంచుకోవడమైంది. సీమాంతర దేశాలపై దూకుడుగా వ్యవహరించేందుకు తన డ్యామ్‌లను ఉపయోగించుకుంటున్న చరిత్ర చైనాది. ఏడాది పొడుగునా వర్షపాతంలో గణనీయమైన పెరుగుదల ఉన్నది. జూలై, సెప్టెంబర్‌ మధ్య గరిష్ఠంగా ఉంటుంది. బ్రహ్మపుత్ర నది రెండు అధిక నీటిమట్టం సీజన్‌లను చూస్తుంటుంది. ఈ క్రమంలో బ్రహ్మపుత్ర ద్వారా నీటిని ఒక్కసారిగా వదిలితే అది భారత్‌ను ముంచెత్తే ప్రమాదం ఉందన్న ఆందోళన వస్తోంది. దీంతో దీనిపై భారత్‌ గట్టిగానే వ్యతిరేకిస్తున్నా.. అడ్డుకోవడమే మంచిది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News