లౌకికరాజ్యంలో పండుగలు ఎంతో ముఖ్యం !

లౌకికరాజ్యంలో పండుగలు ఎంతో కీలకంగా మారాయి. సుమారు 141 కోట్ల జనాభా గల భారతదేశం వంటి అతిపెద్ద దేశంలో లౌకికరాజ్యం సక్రమంగా నిలపడాలంటే పండుగలకు అధిక ప్రాధాన్యం ఇవ్వటం తప్పదు. స్వాతంత్య్రం రాకమునపు కూడా భారతదేశాన్ని పాలించిన అనేక రాజులు, ఏకచక్రాధిపతులు కూడా పండుగలకు కొన్ని ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చేవారు. అప్పుడు లౌకికరాజ్యం లేదుకనుక నడిపోయింది. కానీ నేటి స్వాతంత్య్ర అనంతరం భారత్‌ అతిపెద్ద లౌకికరాజ్యంగా అవతరించింది. ఇందులో అనేక మతాలు, అనేక సంస్కృతులు మిళితమై ఉన్నాయి. అందుకనే ఏ పార్టీ పాలనలో ఉన్నా వారివారి మతాలకు సంబంధించిన పండగులకు ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైనా వారివారి మతాలకు సంబంధించిన పండుగలకు వారు స్వేచ్ఛగా నిర్వహించుకోలేరో అక్కడ లౌకిక రాజ్యం నిలపటానికే ఆస్కారమే లేదు.

దీనిని గుర్తెరిన పాలకులు స్వాతంత్య్రం అనంతరం ఎంతో జాగ్రత్తగా పండుగలకు ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ముఖ్యంగా భారత్‌ వంటి అతిపెద్ద దేశంంలో ప్రజలు కూడా కలిసిమెలిసి ఉంటున్నారంటే దానికి కూడా పండుగలే మరోకారణంగా చెప్పవచ్చు. హిందువులు, ముస్లిం, క్రైస్తవులు, బౌద్ధులు నిర్వహించుకునే వారివారి పండుగలే ఇతర మతస్తులు శుభాకాంక్షలు తెలపడటం, కలిసిమెలసి జరుపుకోవటం వల్ల ఇంత కాలంగా లౌకికరాజ్యంగా భారత్‌ నిలబడుతూ వస్తుంది. ఇందులో ఒక్క మతానికి సంబంధించిన పండుగలకు ప్రాధాన్యం ఇవ్వకున్నా, నిర్లక్ష్యం చేసినా అది లౌకికరాజ్యానికి బీటలు వారే పరిస్థితులు తీసుకొస్తుంది. ప్రపంచంలోని కొన్ని కొన్ని మతాలకు సంబంధించిన పండుగలకు కొన్ని ఆంక్షలు విధించారు. అప్పుడు ఆ దేశంలో ప్రజాస్వామ్యం నడుస్తున్నందన భావన మెళ్లిగా సన్నగిల్లుతుంది. లౌకికరాజ్యంగా చెప్పబడదు.

ముఖ్యంగా ముస్లిం పాలిత దేశాల్లో ఈవిధమైన ఆంక్షలు విధించడం వల్ల అక్కడ ప్రజాస్వామ్యానికి తీవ్ర భంగం వాటిల్లుతోంది. ఇక యూరపన లాంటి దేశంలోనూ అన్ని మతాలకు సంబంధించిన పండుగలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ వస్తున్నారు. అందుకనే రాజకీయ పార్టీలు కూడా ఇంతటి ప్రాధాన్యతమున్న పండగలను అవకాశంగా చేసుకొని వారి ఓట్లు రాబట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా మనదేశంలో కొన్ని పండుగలకు విగ్రహాలు కొనుగోలు చేసి ఇవ్వటం, ఇతర మతస్తులు నిర్వహించే పండుగలు దుస్తులు, ఇతర నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం వంటివి కూడా చేస్తూ వస్తున్నారు. అయితే వారి ఉద్దేశం ఏదైనా పండుగలకు ప్రాధాన్యత ఇవ్వటం వల్ల ఇంత పెద్ద భారతదేశంలో ఐక్యతకు దారితీస్తుందనేది ఘంటాపథం చెప్పవచ్చు.

పండుగలు మన పూర్వీకుల నుంచి ఆనవాయితీ వస్తున్నాయి, మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయని చెబుతున్నామనే తప్ప మన లాంటి అతి పెద్ద దేశంలో లౌకికరాజ్యం నిలపడటానికి అనేక కీలకం. అందుకే ఇంత పెద్దదేశంలో అన్ని మతాలవారు స్వేచ్ఛగా, హాయిగా జీవించగలుగుతున్నారు. ఎప్పుడైతే వారి స్వేచ్ఛకు భంగం కలుగుతుందని అక్కడ పాలకులపై వ్యతిరేకత ఏర్పడి అవాంఛనీయ సంఘటనలు, ఘర్ణణలతో అట్టుడికి ప్రజాస్వామ్యానికి పెద్ద ఆటంకంగా మారుతుంది. ఇది పాలకులు గుర్తుపెట్టుకున్నంత వరకు లౌకికరాజ్యం సాఫీగా సాగుతుంది. ఇకవేళ ఎక్కడైనా ఆంక్షలు వంటివి విధించడం, ఏ ఇతర పండగలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వంటికి జరిగితే మాత్రం మెళ్లిమెళ్లిగా లౌకిక రాజ్యానికి బీటలు పడి దారి కూలిపోయేంత వరకు దారితీస్తుంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News