హైదరాబాద్, జనవరి 05: ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాకు IRCTC ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ సికింద్రాబాద్ నుంచి యాత్రికులను తీసుకెళ్లేందుకు ప్రత్యేక రైళ్లను అందుబాటులో ఉంచింది. ఈ రైళ్లు జనవరి 14న ప్రారంభమై, 45 రోజుల పాటు కొనసాగే కుంభమేళాలో యాత్రికుల కోసం అందుబాటులో ఉంటాయి. ప్రత్యేక రైళ్లు జనవరి 17, 19, 24, ఫిబ్రవరి 2, 7, 14, 16, 21వ తేదీల్లో అందుబాటులో ఉంటాయని IRCTC ప్రకటించింది.
