హైదరాబాద్, జనవరి 05: హిమాయత్నగర్లోని మినర్వా గ్రాండ్ హోటల్లో ఆదివారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. హోటల్లోని వంటగదిలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే సమీప ఫైర్ స్టేషన్ నుండి అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. తక్షణమే చర్యలు తీసుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
