హైదరాబాద్, జనవరి 04: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి అధ్యక్షతన, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కమీషనర్ సాబెర్ అలి, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి శనివారం నిజాంపేట్ నగర పాలక సంస్థ 26వ సాధారణ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ పాలక వర్గం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు మంజూరైన అభివృద్ధి పనులు, చేపట్టిన నిర్మాణ అభివృద్ధి పనులు, నిర్మాణ దశలో ఉన్న పలు అభివృద్ధి పనులు, చేపట్టవలసిన పనులు, టెండర్ దశలో ఉన్న పనులు, అవసరం లేని/సైట్ వివాదం వంటి పనులు, వాటి నిధుల వివరాలు వంటి అంశాలు.. అదే విధంగా కార్పొరేషన్ 33 డివిజన్లలో కావల్సిన మౌలిక సదుపాయాలు, వసతులు, అవసరమైన నిధులు, పెండింగ్ దశలో ఉన్న పనులు వాటి పూర్తి, ఆయా డివిజన్ల పరిధిలో నెలకొన్న పలు సమస్యలు వాటి పరిష్కారం వంటి పలు కీలక ప్రధాన అంశాలపై ప్రజాప్రతినిధుల సలహాలు సూచనలు ప్రతిపాద ఆమోదాలతో సుధీర్ఘ చర్చా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎన్ఎంసి కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఎన్ఎంసి ఆయా విభాగాల అధికారులు, వార్డ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
