మురుగు నీటి సమస్యను పరిష్కరించాలన్న స్ధానికులు

హైదరాబాద్‌, జనవరి 04: మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్ లో మురుగు నీటి సమస్యను పరిష్కరించాలని స్ధానికులు శనివారం మల్కాజిగిరి డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎన్.జగదీష్ గౌడ్ ఆధ్వ ర్యంలో, సర్కిల్ కార్యాలయంలో ఉప కమిషనర్ జి.రాజును కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ మాట్లాడుతూ.. ఈ కాలనీలోని వీధి నెంబర్ 2 లో నాలా పైకప్పు (స్లాబ్) తొలగించి, మళ్ళీ నూతనంగా 40 ఫీట్ల వెడల్పుతో పైకప్పు(స్లాబ్) నిర్మిస్తున్నారని, దీంతో వర్షా కాలంలో నీటి ప్రవాహం పెరిగి కాలనీలోని 1,2, 3 వీదులలోని ఇళ్లలోకి సమీప నాలాలోని మురుగునీరు చేరి కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

దీనికి సానుకూలంగా స్పందించిన ఉప కమిషనర్ రాజు మాట్లాడుతూ…తాను త్వరలోనే కాలనీలో పర్యటించి సమస్యను పరిశీలించి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని హామీనిచ్చారు. ఈ కార్యక్ర మంలో కమల్, జాకబ్, రాజు, విశ్వనాథం, సత్యనారాయణ,స్వాతి, పుష్పమ్మ, అనిత, నరసమ్మ, ఏమీనా, లలిత,కవిత,లేఖ, అనురాధ, శిల్ప తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News