విజయనగరం, జనవరి 04: రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం ఒక్కటే మార్గమని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకరరావు అన్నారు. లౌకిక శక్తులు ఈ కృషిలో భాగం కావాలని ఆయన ప్రజలకు పిలుపు నిచ్చారు. శనివారం దాసన్నపేట, నవాబ్ పేటలలో ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ఆర్ధిక పరిస్థితి దిగజారిపోతుంటే మత సామరస్యానికి గండికొట్టి మతోన్మాద చర్యలకు పూనుకుంటున్నారు. కావున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
దేశ సమైక్యత, మతసామరస్యం ,రాజ్యాంగ పరిరక్షణకై దేశ వ్యాప్తంగా సిపిఎం వారం రోజులు పాటు ప్రచార కార్యక్రమం నిర్వహించాలని ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం దాసన్న్నపేట కణపాకలోజరిగింది. కణపాకలో సిపిఎం జిల్లా కమిటి సభ్యులు పి.రమణమ్మ మాట్లాడుతూ హిందూ,ముస్లిం, కైస్త్రవులు అందరూ అన్నదమ్ముల్లా కలిసి జీవిస్తున్న దేశంలో మతసామరస్యం వెల్లివిరుస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలోసూరిబాబు, రవి, గోపి తది తరులు పాల్గొన్నారు.