హైదరాబాద్, జనవరి 02: ఆంగ్ల నూతన సంవత్సరం సందర్బంగా శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి ని గురువారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని పలు అభివృద్ధి పనులపై, పలు సమస్యలపై కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి కి వివరించారు. ఈ కార్యక్రమం లో ఎస్ ఈ శంకర్ నాయక్, గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షులు తిరుపతి, సీనియర్ నాయకులు శేఖర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
