సోలార్‌తో.. విద్యుత్ ఛార్జీలు ఆదా: పీఏసీ చైర్మన్ గాంధీ

హైదరాబాద్, జనవరి 02: సోలార్‌ ద్వారా సౌరశక్తిని వినియోగిస్తే, భూమిపై కర్బన ఉద్గారాలు తగ్గుతాయని, దాని వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ నల్లగండ్ల లోని హేమ సాయి లేక్ టవర్స్ అపార్టుమెంట్స్ లో రూ. 53 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన 116 కె వి రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్ ని గురువారం పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే గాంధీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ సహజ వనరులను ఉపయోగించుకోవడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. తరిగిపోతున్న వనరుల తరుణంలో సహజ సిద్దమైన సౌర శక్తిని వాడుకొని సద్వినియోగం చేసుకుంటూ భావితరాలకు ఆదర్శంగా నిలవాలని అన్నారు.

116 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుచేసిన మొట్టమొదటి అపార్ట్మెంట్ ఇదే కావడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. హేమ సాయి వెల్ఫేర్ అసోసియేషన్ ను గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం.. పునరుత్పాదక శక్తికి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రగడ సత్యనారాయణ రావు, హేమ సాయి లేక్ వ్యూ టవర్స్ అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ హరీష్ దామరాజు, వైస్ ప్రెసిడెంట్ అరవింద్ రెడ్డి, సెక్రెటరీ శ్రీనివాస్ వోలెటి, ట్రెజరర్ రాజన్ బాబు, జాయింట్ సెక్రటరీ పరిమల్ సహు, అడిషనల్ సెక్రెటరీ ప్రతాప్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News