హైదరాబాద్, జనవరి 1: రెండు ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ బీసీ, మైనార్టీ విద్యార్థుల ఫీజు బకాయిలు రూ. 4 వేల కోట్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం అనుబంధ విభాగం, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
విద్యా వ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల 3న రాష్ట్రవ్యాపిత చలో కలెక్టరేట్ల ముట్టడి, 5న ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి రాష్ట్ర మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్, పి.జి., డిగ్రీ, ఇంటర్ తదితర కాలేజి కోర్సులు చదివే బీసీ, ఈ బీసీ విద్యార్థుల పూర్తి ఫీజులు మంజూరు చేయాలి. ఈ స్కీమును 2008 లో పెట్టినట్లుగా యదాతధంగా ఆమలు చేయాలి. కాలేజీ విద్యార్థులకు సంవత్సరంకు రూ.20 వేల స్కాలర్షిప్ ప్రతి విద్యార్థికి నుంజూరు చేయాలి. ఇంటర్ మీడియట్ కోర్సులు చదివే విద్యార్థుల ఫీటి రియంబర్స్మెంట్ రేటు రూ.1800 నుండి 2 వేలకు పెంచాలి.
విదేశీ విద్యకు అమెరికా, కెనడా ఆస్ట్రేలియా లో చదవే విద్యార్థులందరికి రూ. 20 లక్షల పైన మంజూరు చేయాలి. గురుకుల హాస్టల్ కు సొంతభవనాలు నిర్మించడం, బి.సి స్టడీ సర్కిల్ బడ్జెట్ ను రూ 200 కోట్లకు పెంచాలి. అన్ని ఉద్యోగ పోటీ పరీక్షలకు కోచింగ్ ఇవ్వాలి, వారికి నెలకు రూ. 5వేల స్టెఫండు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వివిధ బీసీ సంఘాల నేతలు, విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు.