హైదరాబాద్, డిసెంబర్ 31: తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు హామీ ఇచ్చారు. కాప్రా డివిజన్ పరిధిలోని ఎల్లారెడ్డి గూడ గ్రామంలో అధికారులతో కలిసి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు పర్యటించారు. రోడ్స్, డ్రైనేజీ గురించి స్థానిక ప్రజలతో చర్చించి వారు ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. త్వరలోనే హనుమాన్ చౌరస్తా నుంచి హనుమాన్ టెంపుల్ మీదుగా బస్టాప్ వరకు 20 లక్షలతో డ్రైనేజీ పనులు మరియు తాళ భాయ్ దేగరా 10 లక్షలతో డ్రైనేజ్ పనులు మొదలు పెట్టాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డిఈ బాలకృష్ణ గారు, వాటర్ వర్క్ DGM సతీష్ గారు మరియు AE లు సూరజ్, రోహిత్ మరియు ఎలక్ట్రిక్ AE సత్యనారాయణ. BRS పార్టీ నాయకులు బైరీ నవీన్ గౌడ్, డుంపాల నాగరాజు, అల్లం గణేష్ యాదవ్, కాశీ నాథ్, బైరి శ్రీనివాస్ గౌడ్, అల్లం రాజు యాదవ్, బైరి రాఘవేంద్ర గౌడ్, శ్రీకాంత్, సతీష్, గ్రామ పెద్దలు బైరి రామచందర్ గౌడ్, రామకృష్ణ గౌడ్, ముదిగొండ శీను, పాండు, చిందం యాదయ్య, శ్రీశైలం, గూడ బాలయ్య, విఠల్ గౌడ్, నారం రెడ్డి, డుంపాల జగన్ ,పాడలా భాస్కర్ చారి, తాండ జ్ఞానేశ్వర్ గౌడ్, అల్లం శంకర్ బాలనర్సింహ.. మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గున్నారు.