- రైతులను రాబందుల్లా దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
హైదరాబాద్, డిసెంబర్ 31: అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అన్ని వర్గాలను నట్టేట ముంచుతుందని బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రైతులకు రైతుబంధు డబ్బులు జమ చేయకపోగా కాంగ్రెస్ రాబందులు ఉల్టా రైతులనే దోపిడీ చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. జోగులాంబ జిల్లా ఐజ మండలంలో ఆర్డీఎస్ కెనాల్ కింద పండిరచిన వరి ధాన్యాన్ని గవర్నమెంట్ ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. చాలా చోట్ల మహిళా సమాఖ్య అధ్యక్షురాళ్ల అకౌంట్ను తమ గుప్పిట్లో పెట్టుకొని ఇదే అదనుగా ఐకేపీ సెంటర్ల దగ్గర కాంగ్రెస్ నాయకులు రైతులను పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారు. క్వింటాల్కు నాలుగు కిలోల చొప్పున తక్కువ తూకం వేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ఒక ఎకరం 30 క్వింటాలు దిగుబడి వస్తుంది.. కావున క్వింటాల్కి నాలుగు కిలోల చొప్పున తీసివేస్తే ఒక ఎకరం మీద రైతు రూ. 3500లు నష్టపోతున్నారు. మళ్లీ హమాలీ పేరిట క్వింటాల్ చొప్పున రూ. 46 వసూలు చేస్తున్నారు. ఈ లెక్క ప్రకారం సగటున ఒక ఎకరానికి ఐకేపీ సెంటర్ల ద్వారా గవర్నమెంట్కి విక్రయిస్తే రూ. 4880లు రైతులు నష్టపోతున్నామని ఇక్కడి రైతులు ఆవేదన చెందుతున్నారని ఆర్ఎస్పీ పేర్కొన్నారు. కేసీఆర్ గవర్నమెంట్లో ఎకరాకు పెట్టుబడి సహాయంగా రూ. 5000 అందజేస్తే రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఉల్టా ఎకరాకు రూ. 4880 నష్టపోతున్నారు. మొత్తం రైతుల నుండి దోచుకున్న సొమ్ము ఎకరాకు దాదాపు పదివేల రూపాయలన్న మాట! ఇట్ల గుట్టు చప్పుడు కాకుండా తెలంగాణ రైతులను ఇంకా ఎన్ని చోట్ల దోచుకుంటున్నారో ఈ కాంగ్రెసు కేడీలు! ఒక కన్నేసి ఉంచండి. రైతన్నలారా, తస్మాత్ జాగ్రత్త!! అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.