పెరుగుతున్న క్యాన్సర్‌ పేషెంట్లు

  • ప్రభుత్వ పరంగా అందని సంపూర్ణ వైద్యం
  • ప్రైవేట్‌ ఆస్పత్రలకు వెళ్లలేక మృత్యువాత 

 

విజయవాడ, డిసెంబర్‌ 31: ఇటీవలి కాలంలో క్యాన్సర్‌ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగు తుండడం కలవరపెడుతున్నది.అందులో చాలా మందికి పూర్తి స్థాయిలో వైద్యం అందక మృత్యువాత పడుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. వైద్య చికిత్స కోసం ఖర్చు భరించే స్థోమత లేకపోవడం.. ఇతర ప్రాంతాల్లోని ప్రభుత్వ దవాఖానలకు వెళ్లే పరిస్థితి లేకపోవడం నిరుపేద రోగుల ప్రాణాల విూదకు వస్తున్నది.
ఈ నేపథ్యంలో క్యాన్సర్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయడం ముఖ్యం. క్యాన్సర్‌ కారకాలపైనా ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది. ఉభయ తెలుగు రాష్టాల్ల్రో క్యాన్సర్‌ రోగుల సంఖ్యం టేటా పెరుగుతున్నది. ప్రభుత్వ ప్రధాన దవాఖానతో పాటు వివిధ ప్రైవేట్‌ వైద్యశాలల్లో ఏటా చికిత్స పొందుతున్న రోగులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతున్నది.

గతంతో పోలిస్తే ఇప్పుడు క్యాన్సర్‌ ఆస్పత్రులు కిటకిటాడుతున్నాయి. అలాగే వ్యాధి ఎంతలా విస్తరిస్తున్నదో నివేదికలను బట్టి అర్థమవుతుంది. క్యాన్సర్‌ రోగుల సంఖ్య ఏటేటా పెరుగుతున్న క్రమంలో స్థానికంగా ప్రభుత్వ వైద్యం పూర్తి స్థాయిలో అందుబాటులో లేక నిరుపేద రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ప్రైవేట్‌ దవాఖానల్లో చికిత్స చేయించుకుంటే ఆర్థిక భారం తప్పడం లేదు. క్యాన్సర్‌ సోకిన నిరుపేదలైతే చికిత్స చేయించుకునే స్థోమత లేక, దూర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ దవాఖానలకు వెళ్లలేక మృత్యువాత పడుతున్నారు. చికిత్స పొందుతున్న రోగుల్లో ఏటా వేలల్లో మరణాలు సంభవిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు.

క్యాన్సర్‌ మునుపటిలా ప్రాణాంతకం కాదని, మొదటి దశలో గుర్తించి సరైన వైద్యం చేయించుకుంటే నయమయ్యే అవకాశమున్నదని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాధిని ప్రాథమిక స్థాయిలో గుర్తించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ప్రభుత్వ దవాఖానలో పూర్తి స్థాయిలో వైద్యం అందించే పరిస్థితి లేక ప్రైవేట్‌ క్యాన్సర్‌ ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తున్నారు. చాలా మంది అక్కడికి వెళ్లలేక వ్యాధిని నిర్లక్ష్యం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రైవేట్‌ దవాఖానల్లో వైద్యం చేయించుకునే స్థోమత లేక పోవడంతో మహిళలు చాలా మంది క్యాన్సర్‌ వ్యాధిని పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. మహిళల్లో ముఖ్యంగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌, సర్వైకల్‌ క్యాన్సర్‌, ఒరాల్‌ క్యాన్సర్‌ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.

ఇక పురుషుల్లోనూ స్కిన్‌, బోన్‌, గొంతు, స్టమక్‌, పెద్దపేగు వంటి క్యాన్సర్‌ లక్షణాలు కనిపిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణాలు మహిళల్లోనూ ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తున్నది. క్యాన్సర్‌ చికిత్స అందించేందుకు వైద్య విధానంలో పలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా క్యాన్సర్‌ను ఉన్న స్టేజీలోనే ఉంచే విధంగా పాటి కీమోథెరపీ, నయం చేసేందుకు ఇమ్యూనోథెరపీ పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. తక్షణమే జిల్లాకో క్యాన్సర్‌ సూపర్‌ స్పెషాలిటీ దవాఖానను ఏర్పాటు చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు. క్యాన్సర్‌ రోగులు పెరుగుతున్న నేపథ్యంలో సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటుకు కేంద్రం కూడా ముందుకు రావాల్సి ఉంది. క్యాన్సర్‌కు పూర్తి స్థాయిలో ప్రభుత్వ వైద్యం అందిస్తే నిరుపేద రోగులపై ఆర్థిక భారం పడుకుండా ఉంటుంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News