ప్రజాధనం లూటి చేసిన కేసీఆర్, కేటీఆర్ లపై చర్యలు తీసుకోవాలి

హైదరాబాద్, డిసెంబర్ 30: లోపాయికారి ఒప్పందాలతో ప్రజాధనం లూటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని బిసి పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఈడిని కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ లోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో తన అనుచరులతో కలిసి జాయింట్ డైరెక్టర్ గారికి ఫిర్యాధు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఔటర్ రింగ్ రోడ్డు టోల్ లీజును ఐఆర్బీ సంస్థకు ఇవ్వడంలో మరియు వరంగల్, రంగారెడ్డి కైటెక్స్ యూనిట్ల స్థాపనలోనూ అక్రమాలు జరిగాయన్నారు.

క్విడ్ ప్రోకో పద్ధతిలో ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన కంపెనీలు టెండర్ లేదా లీజు అగ్రిమెంట్ అయిన వెంటనే బిఆర్ఎస్ పార్టీకి ఇచ్చాయని, ఆ వెంటనే బిఆర్ఎస్ ఆ బాండ్లను ఎన్ క్యాష్మెంటు చేసుకున్నదని ఆరోపించారు. అప్పటి పరిశ్రమలు మరియు మున్సిపల్ శాఖ మంత్రి మంత్రి కేటీఆర్ కు ఈ క్విడ్ ప్రోకో తతంగంతో నేరుగా ఒప్పందం ఉందన్నారు. క్విడ్ ప్రోకో చేయడం వల్లనే జాతీయ పార్టీ బీజేపీ తర్వాత అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్లు బీఆర్ఎస్ పార్టీకే వచ్చాయన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఒప్పందాలు, కాంట్రాక్టులు, లీజులపై విచారణ వేగవంతం చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలను గోల్ మాల్ చేసిన కేసీఆర్ కేటీఆర్ లను అరెస్ట్ చేసి విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అధ్యక్షులు గాలిగల్ల సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News