హైదరాబాద్, డిసెంబర్ 30: అట్టహాసంగా కొప్పుల వెలమ వార్షికోత్సవం కూనిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి కొప్పుల వెలమ రాష్ట్ర అధ్యక్షులు పోల లక్ష్మణ్ నాయుడు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ కొప్పుల వెలమల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు కొల్లి రామకృష్ణ, డి.ఎస్.పి తేర్లి శివున్నాయుడు, పారిశ్రామికవేత్త గొల్లు బాబురావు, విద్యాసంస్థల అధినేత నల్ల అప్పల నాయుడు, ఆరోగ్య డైట్ చైర్మన్ డాక్టర్ పూడి లక్ష్మణ్, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ (గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్), గొర్లె వెంకట నరసింహారాజు, సినీ ఎడిటర్ ప్రవీణ్ పూడి, కిరో థెరపిస్ట్ నటుడు దర్శకుడు డాక్టర్ గవిరెడ్డి గౌరీ శంకర్, హైకోర్టు న్యాయవాది పెద్దింటి అనిల్ ముఖర్జీ లను ఘనంగా సన్మానించారు.
సన్మాన గ్రహితలకు పూలమాలలు వేసి, శాలువా కప్పి, సన్మాన పత్రాన్ని అందించి సత్కరించారు. ఈ సందర్భంగా కూనిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న కొప్పు వెలమల సంక్షేమానికి తెలంగాణ కొప్పుల వెలమ సంక్షేమ సంఘం కృషి చేస్తుందని అన్నారు. కొప్పుల వెలమలలో అభివృద్ధి చెందిన వారు కొప్పుల వెలమల్లో నిరుపేదలుగా ఉన్న వారిని ఆదుకోవాలని కోరారు. వివిధ రంగాలలో అభివృద్ధి చెంది సమాజానికి సేవలందిస్తూ కొప్పుల వెలమల జాతి అవునత్యాన్ని ప్రపంచానికి ఇనుమడింప జేయాలని సూచించారు. సన్మానాన్ని అందుకున్న ప్రముఖులు మాట్లాడుతూ.. తాము కొప్పుల వెలమల కులంలో జన్మించి కష్టపడి చదువుకొని దేశ విదేశాల్లో సైతం సేవలందిస్తున్నామని అన్నారు.
తాము కొప్పుల వెలమల కులంలో జన్మించిన రుణాన్ని తీర్చుకునేందుకు కులంలో ఉన్న నిరుపేదల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత విభావరి అందరిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ కొప్పుల వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర కాలెండర్ 2025ను ఆవిష్కరించారు.. రాష్ట్ర సంఘ బాధ్యులు అల్లు వెంకట మల్లీశ్వర రావు, సహాయ కార్యదర్శి రాయపల్లి వెంకట్ రావు, నల్ల బలరాం, శీరా తవిటి నాయుడు, మర్రాపు సత్యం, తెంటు ముసలినాయుడు, పకీర్ నాయుడు, పప్పల ధనలక్ష్మీ, కొల్లి రమ్య, బంకురు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.