- సైబరాబాద్ పరిధిలో ఫ్లై ఓవర్ల మూసివేత
- డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు యధాతథం
- అర్థరాత్రి వరకు మెట్రో రైల్ సర్వీసులు
హైదరాబాద్, డిసెంబర్ 30: ఆంగ్ల నూతన సంవత్సరాది మరికొన్ని గంటల్లో రానుంది. ఈ క్రమంలో ప్రపంచమంతా వేడుకలకు సిద్ధం అవుతుంది. న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబరు 31 రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఐటీ కారిడార్లో ఫ్లై వర్లను మూసివేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఓఆర్ఆర్పై భారీ వాహనాలు, ఎయిర్పోర్టుకు వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతిస్తామన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. సిగ్నల్ జంపింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతారని చెప్పారు. మద్యం సేవించిన వారికి పబ్లు, బార్ల యాజమానులు ప్రైవేటు వాహనాలు, డ్రైవర్లను అందుబాటులో ఉంచాలని పోలీసులు సూచించారు.
న్యూఇయర్ వేడుకల దృష్ట్యా డిసెంబరు 31న రాత్రి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించ నున్నట్లు తెలంగాణ ఫోర్ వీలర్స్ సంఘం ప్రకటించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. 500 కార్లు, 250 క్యాబ్లు అందుబాటులో ఉంటాయని అసోసియేషన్ తెలిపింది. ప్రజలు మద్యం మత్తులో వాహనాలు నడపొద్దని, రోడ్డు ప్రమాదాలు జరగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడిరచింది. నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ మెట్రో రైళ్లు అర్ధరాత్రి వరకు సేవలందించనున్నాయి. డిసెంబర్ 31 సెలబ్రేషన్స్ సందర్భంగా రాత్రి 12.30 వరకు నడవనున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం అర్ధరాత్రి 12.30కి చివరి రైలు స్టేషన్ నుండి బయలుదేరి 1.15 వరకు డెస్టినేషన్ స్టేషన్లో చేరుకోనున్నట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా అర్ధరాత్రి వేడుకలు ఉండటంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు విస్తృతంగా జరిగే అవకాశం ఉండటంతో సేఫ్ గా ఇంటికి చేరుకునేందుకు మెట్రో ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ క్రమంలో.. ప్రయాణికులు మెట్రో రైల్లో సేవ్ జర్నీ చేయాలని మెట్రో ఎండీ సూచించారు. మెట్రో రైల్ సేవలను ప్రత్యేక అకేషన్ పండుగలు టైంలో అర్ధరాత్రి వరకు మెట్రో సేవలను పొడిగిస్తున్నట్టు తెలిపారు. మద్యం తాగి మెట్రోలో తోటి ప్రయాణికులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రయాణికులంతా బాధ్యతాయుతంగా వ్యవహారించాలని మెట్రో ఎండీ సూచించారు.