సల్మాన్‌ఖాన్‌ సికిందర్‌ టీజర్‌ వాయిదా

బాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌ సల్మాన్‌ ఖాన్‌ కాంపౌండ్‌ నుంచి వస్తోన్న మోస్ట్‌ ఎవెయిటెడ్‌ సినిమాల్లో ఒకటి ‘సికందర్‌’. కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2025 ఈద్‌ కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మేకర్స్‌ ముందుగా ప్రకటించిన ప్రకారం టీజర్‌ను ఇవాళ ఉదయం 11:07 నిమిషాలకు లాంచ్‌ చేయాల్సి ఉంది. అయితే మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్‌ సింగ్‌ గురువారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే.

దేశమంతా సంతాపం ప్రకటిస్తున్న ఈ సమయంలో ఆయన మృతికి సంతాపంగా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను వాయిదా వేస్తున్నాం. టీజర్‌ను రేపు ఇదే (ఉదయం 11:07) సమయానికి లాంచ్‌ చేస్తామని అధికారిక ఖాతాలో ట్వీట్‌ చేసింది నడియాద్వాలా గ్రాండ్‌సన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌. సికిందర్‌లో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని నడియాద్వాలా గ్రాండ్‌సన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై సాజిద్‌ నడియాద్వాలా నిర్మిస్తుండగా.. సత్యరాజ్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సమాజంలోని అవినీతి, నేరాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి కథ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని ఇన్‌సైడ్‌ టాక్‌.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News