రెండు పార్ట్‌లుగా.. విజయ్‌ దేవరకొండ గౌతమ్‌ తిన్ననూరి ప్రాజెక్టు

టాలీవుడ్‌ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, జెర్సీ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి కాంబినేషన్‌ లో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ‘వీడీ12’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్‌ రానుండగా విజయ్‌ దేవరకొండ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. సితార ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నిర్మాత నాగవంశీ. ఆయన మాట్లాడుతూ.. వీడీ12 ప్రాజెక్ట్‌ రెండు పార్టులుగా రాబోతుందని ప్రకటించాడు.

ఈ ఆలోచన సినిమా తీస్తున్న టైంలో రాలేదని.. షూటింగ్‌ స్టార్ట్‌ అవ్వకముందే ఈ ఆలోచన వచ్చినట్లు తెలిపాడు. అయితే ఈ రెండు పార్టులలో రెండు వేరు వేరు కథలు ఉంటాయని నాగవంశీ చెప్పుకోచ్చాడు. మరోవైపు ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చిలో తీసుకురావడానికి ప్లాన్‌ చేస్తున్నట్లు తెలిపాడు. ఒకవేళ ఆ టైంలో పవన్‌ కళ్యాణ్‌ హరిహర వీరమల్లు ఉంటే తమ సినిమాను వాయిదా వేయనునట్లు చెప్పుకోచ్చాడు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News