ఆర్ధిక వ్యవస్థ దిశను మార్చిన వ్యక్తి మన్మోహన్‌: మంత్రి అనగాని

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మరణం పట్ల రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్‌ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మన్మోహన్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సంస్కరణలను ప్రవేశపెట్టి దేశ ఆర్ధిక వ్యవస్థ దిశను మార్చిన వ్యక్తి మన్మోహన్‌ అని కొనియాడారు. పదేళ్లు ప్రధానిగా పనిచేసినప్పటికీ అతి సాధారణ జీవితాన్ని గడిపిన వ్యక్తి మన్మోహన్‌ అన్నారు. ఆయన లేని లోటు దేశానికి పూడ్చలేనిది అని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ పేర్కొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News