హృదయపూర్వక నివాళులు: మంత్రి పార్ధసారథి

దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ట పరచడంలో తనదైన ముద్ర వేసిన డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని హౌసింగ్‌, ఐఅండ్‌ పీఆర్‌ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఆర్బీఐ గవర్నర్‌గా, ప్రణాళిక సంఘం డెప్యూటీ చైర్మన్‌గా, ఆర్థిక మంత్రిగా, అనంతరం సుధీర్ఘ కాలం ప్రధాన మంత్రిగా ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంతో పాటు ఉపాధి హామీ పథకం, ఆర్టీఐ వంటి చట్టాలను చేసి ప్రభుత్వ పాలనలో కూడా ప్రత్యేకతను చాటుకున్నారన్నారు. ఆర్థిక వేత్తగా, సుదీర్ఘ కాలం ప్రధాన మంత్రిగా కొత్త ఒరవడికి నాంది పలికిన వారి మృతికి ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నామని.. హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నామని మంత్రి పార్ధసారధి తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News