మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్థిక మేధావి కన్నుమూత దేశానికి తీరనిలోటన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి వైపు పరుగులు పెట్టించిన ఆర్థిక శిల్పి మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించి పేదలకు అండగా నిలిచారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు మంత్రి సవిత తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
