నిమ్స్‌లో.. నేడు ఓపీ సేవలు బంద్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 2: భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతికి దేశమంతా నివాళులర్పిస్తోంది. హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రి కూడా మన్మోహన్‌సింగ్‌కు నివాళులర్పించింది. అయితే మాజీ ప్రధాని మృతికి నివాళిగా శుక్రవారం ఓపీ(ఔట్‌ పేషెంట్‌) సేవలను నిలిపివేస్తున్నట్లు నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌ బీరప్ప ప్రకటించారు. కేవలం ఎమర్జెన్సీ, క్యాజువలిటీ సర్వీసులు మాత్రమే పని చేస్తాయని పేర్కొన్నారు.

ఓపీ సాధారణ సేవలు డిసెంబర్‌ 28 నుంచి అందుబాటులోకి వస్తాయని డాక్టర్‌ బీరప్ప స్పష్టం చేశారు. ఓపీ సేవలను ఆకస్మికంగా నిలిపివేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తాము ఎక్కడ చూయించుకోవాలని ఆందోళన వ్యక్తం చేశారు. ఓపీ సేవలు బంద్‌ చేస్తున్నట్లు ఎలాంటి ప్రకటన చేయకపోవడం, ఇక్కడికి వచ్చాక సేవలు నిలిపివేసినట్లు తెలియడంతో రోగులు, వారి అటెండర్లు నిమ్స్‌ డాక్టర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News