పీవీ సింధు రిసార్ట్ విశేషాలివే..?

హైదరాబాద్‌, డిసెంబర్‌ 25: బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పీవీ సింధు హైదరాబాదీ వ్యాపారవేత్త వెంకట దత్త సాయిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ జంట ఉదయ్‌పూర్‌లోని ఓ రిసార్టులో పెళ్లాడారు. ఆ వెడ్డింగ్‌ వేదిక గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చాలా విలాసవంతమైన, ప్రత్యేకమైన రఫేల్స్‌ ఉదయ్‌పూర్‌ రిసార్టులో సింధు పెళ్లి జరిగింది. ఆ కళ్యాణ వేదిక ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ద టౌన్‌గా మారింది. సుందరమైన ప్రదేశంలో ఉన్న ఆ ఫైవ్‌ స్టార్‌ స్పాట్‌.. సింధు జీవితంలో ఓ ప్రత్యేకంగా నిలిచింది. 21 ఎకరాలు ఉన్న ఆ ప్యాలెస్‌.. ఫ్రెంచ్‌ ఆల్ట్రా లగ్జరీ బ్రాండ్‌ రఫేల్స్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ ప్రాపర్టీగా గుర్తింపు ఉన్నది.

సింగపూర్‌కు చెందిన రఫేల్స్‌ హోటల్‌ కూడా ఆ వేదికలోనే ఉన్నట్లు తెలిసింది. ఉదయ్‌ సాగర్‌ చెరువు మధ్యలో ఆ హోటల్‌ ఉంది. అరావలీ పర్వత అందాలు అక్కడ పర్యాటకుల్ని అమితంగా ఆకర్షిస్తుంటాయి. రిసార్టులోని వృక్షాలు,జంతువులు కూడా స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తాయి. ఆ ఖరీదైన హోటల్‌లో ఒక రాత్రి అకామిడేషన్‌ సుమారు లక్ష వరకు ఉంటుందని భావిస్తున్నారు. ప్రైవేట్‌ పూల్స్‌, ఆర్ట్‌వర్క్స్‌, లాన్లు.. ఎంతో ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. యురోప్‌కు చెందిన పల్లాడియన్‌ ఆర్కిటెక్చర్‌ స్టయిల్‌లో ఆ హోటల్‌ ప్రాపర్టీని డెకరేట్‌ చేశారు.

రాజ్‌పుత్‌-మొఘల్‌ ప్రావీణ్యం కూడా ఆ హోటల్‌ అందాల్లో కనిపిస్తుంది. చాలా లగ్జరీ రూమ్‌లు, సూట్‌లు ఉన్నాయి. డైనింగ్‌, స్పా, రఫేల్స్‌ లాంగ్‌ బార్‌, రైటర్స్‌ బార్‌ ఉన్నాయి. క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా, అతని మాజీ భార్య నటాషా స్టాన్‌కోవిక్‌.. గత ఏడాది ఈ హోటల్‌లోనే తమ వెడ్డింగ్‌ స్మృతులను గుర్తు చేసుకున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News