మెదక్‌ చర్చిలో శతాబ్ది ఉత్సవాలు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 25: మెదక్‌ చర్చిలో క్రిస్మస్‌ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఇంచార్జి బిషప్‌ రైట్‌ రెవరెండ్‌ రూబెన్‌ మార్క్‌ దైవ వాక్యాన్ని అందించారు. వందేండ్ల మహా దేవాలయంలో ప్రతిష్ట మహోత్సవం జరుపుకుంటున్నందుకు అందరం ధన్యులమని తెలిపారు. దివ్యమైన ఈ మహా దేవాలయంలో 1924 డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ వేడుకలు జరిగాయని చెప్పారు. తాజాగా వందేండ్ల వేడుకలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో అందరం భాగస్వామ్యులు అయినందుకు ధన్యులమని అన్నారు.

ఆసియా ఖండంలోని అతి పెద్దదైన రెండో చారిత్రాత్మక దేవాలయంలో క్రిస్మస్‌ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని ఇంచార్జి బిషప్‌ రైట్‌ రెవరెండ్‌ రూబెన్‌ మార్క్‌ తెలిపారు. మన జీవితంలో ఇది ఒక ఒక మైలు రాయి అని పేర్కొన్నారు. జ్ఞానులు ఏసుక్రీస్తు అనుసరించిన మార్గాన్ని అనుసరించాలని సూచించారు. లోక రక్షకుడిగా నన్ను రక్షించడానికి ఏసు వచ్చాడు.. సమస్త మానవాళికి ఏసుప్రభువు ఆశీస్సులు ఉండాలని అన్నారు. ‘బెత్లెహెంలో దావీదు వంశంలో ఏసు జన్మించాడు.

ఏసును కలిగిన బిడ్డలు నిస్వార్థంగా ఆలోచించాలి. స్వార్థ లోకంలో ప్రతిది నాది అనే ఆలోచనతో ఉంటున్నారు. ప్రతి ఒక్కరు స్వార్థమైన ప్రార్థనలు చేయాలి. స్వార్థం మరియమ్మలో లేదు. ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా ఏసుక్రీస్తు మార్గాన్ని అనుసరిస్తూ బతకాలి.’ అని సూచించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News