తిరుమల, డిసెంబర్ 25: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 14 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 16 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 67,209 మంది దర్శించుకోగా 22,708 మంది తలనీలాలు సమర్పించుకున్నారు . భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.23 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.
