అమరావతి, డిసెంబర్ 25: భవానీ దీక్షల విరమణ చివరి రోజు కావడంతో విజయవాడలోని ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడిరది. బుధవారం తెల్లవారుజాము నుంచే భవానీ భక్తులు కృష్ణానది ఒడ్డున స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అన్ని క్యూలైన్లల్లో ఆలయ అధికారులు భక్తులకు ఉచిత దర్శనం కల్పించారు. క్యూలో నిలుచున్న భక్తులకు 2 నుంచి 3 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వివరించారు.అమ్మవారి దర్శనం అనంతరం భవానీ ఘాట్, పున్నమి ఘాట్, సీతమ్మవారి పాదాల సమీపంలో ఏర్పాటుచేసిన తాత్కాలిక కేశఖండన శాల వద్ద దీక్షాదారులు తలనీలాలు సమర్పించుకున్నారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా నుంచి భవానీలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు.భవానీ దీక్షాదారులు వయసుతో తారతమ్యం లేకుండా ఏడు కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేశారు. భవానీలతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఆలయ ఈవో రామారావుతో పాటు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, సంబంధిత శాఖల అధికారులు సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి భక్తుల రద్దీ, దర్శనాలు, ఇతర సౌకర్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 21న ప్రారంభమైన దీక్షల విరమణ బుధవారంనాటితో ముగుస్తుంది.