పలు రాష్ట్రాల్లో గవర్నర్ల బదిలీలు, నియామకాలు జరిగాయి. రాష్ట్రపతి ఆమోదంతో ఈ మార్పులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
*మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు ఒడిశా గవర్నర్గా బదిలీ అయ్యారు.
*మిజోరం గవర్నర్గా జనరల్ వీకేసింగ్ నియమితులయ్యారు.
*బిహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కేరళ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
*కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ఖాన్ బిహార్ గవర్నర్గా బదిలీ అయ్యారు.
*మణిపూర్ గవర్నర్గా అజయ్కుమార్ భల్లా నియమితులయ్యారు.