నగరం లో.. ఉన్న కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థల తీరు చాలా అవమానకరంగా ఉంటునట్లుగా తెలుస్తుంది. ఎందుకంటె కాలేజీ ఫీజు కట్టడం కొద్దిగా ఆలస్యం అయితే చాలు విద్యార్థులను, వారి తల్లితండ్రులను చాలా రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఇదే కాకుండా పరీక్షలు రాయడానికి అవకాశం లేకుండా చేస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు.
అన్ని విద్యాసంస్థలను ఒకే గాటున కట్టలేము కానీ ఇటువంటి విషయాలు తెలుస్తుంటే.. ఎవ్వరికైనా గుండె పిండేసినట్లుగా ఉంటుంది. అందువలన విధ్యావ్యవస్థలపై, విద్యార్థుల తల్లితండ్రులు తమ పిల్లల భవిషత్తు కొరకు నిలదీస్తున్నారు. ఈ సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెడితే భావితరాల విద్యార్థులకు మేలు జరుగుతుంది.