రాష్ట్రంలో వీఆర్వోల వ్యవస్థ పునరుద్ధరించబడుతోంది. గ్రామానికి రెవెన్యూ అధికారి నియామకానికి రాష్ట్ర సర్కారు పచ్చ జెండా ఊపింది. పూర్వ వీఆర్వో, వీఆర్ఏలకు ఆప్షన్లు కోరుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆసక్తి, అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఈమేరకు ఈ నెల 28 వరకు గడువు విధిస్తూ సీసీఎల్ఏ కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
