శ్యామ్‌ బెనగల్‌ మృతి పట్ల సీఎం రేవంత్‌ సంతాపం

తెలుగు ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు శ్యామ్‌ బెనగల్‌ సోమవారం ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. శ్యామ్‌బెనగల్‌ను పద్మశ్రీ, పద్మ విభూషణ్‌, దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డులు వరించాయి. ఆయన అంకుర్‌, నిశాంత్‌, మంథన్‌ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించారు.

అయితే అతడి మృతి పట్ల సీఎం రేవంత్ సంతాపం తెలియజేశారు. చలన చిత్ర రంగంలో కొత్త ఒరవడిని సృష్టించిన శ్యామ్ బెనగల్ గారి మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు అని, శ్యామ్ బెనగల్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News