సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్కు ఆర్థిక సాయం అందించేందుకు పుష్ప-2 నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ ముందుకొచ్చింది. రూ.50లక్షల చెక్కును సోమవారం సంస్థ తరఫున ప్రతినిధులు బాలుడి తండ్రి భాస్కర్కు అందజేశారు. చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి నిర్మాతలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రేవతి భర్తను పరామర్శించి చెక్కును అందించారు.
