హైదరాబాద్ నగరంలో జలసంరక్షణ, చెరువుల సంరక్షణ విషయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ తనిఖీలు చేపట్టారు. ORR వద్ద జరిగిన తనిఖీల్లో ఆయన నానక్రామ్గూడ వద్ద తౌతానికుంట, భగీరథమ్మ చెరువు, నార్సింగి వెన్నాంపూర్ చెరువుల ఆక్రమణలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలు మరియు ప్రజాప్రతినిధుల ఫిర్యాదులను కూడా స్వీకరించారు.
చెరువుల ఆక్రమణలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి, ప్రభుత్వం నుండి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్బంగా, హైడ్రా కమిషనర్ చెరువుల ఆక్రమణను అరికట్టేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.