NHRC ఛైర్మన్​గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి

మానవ హక్కుల కమిషన్‌ నూతన ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ వి. రామసుబ్రమణియన్‌ నియమితులయ్యారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. NHRC ఛైర్మన్‌గా ఉన్న అరుణ్‌ కుమార్‌ మిశ్రా జూన్‌ 1న పదవీ విరమణ పొందారు. దీంతో తాత్కాలిక ఛైర్‌ పర్సన్‌గా విజయ భారతి సయానీ నియమితులయ్యారు. తాజాగా పూర్తి ఛైర్మన్‌గా రామసుబ్రమణియన్‌ నియమితులయ్యారు. త్వరలోనే ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News