పాఠశాల విద్యకు సంబంధించి నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక నుంచి వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని 5, 8 తరగతుల విద్యార్థులను ఫెయిల్ చేసేందుకు అవకాశం ఏర్పడింది. తాజా గెజిట్ ప్రకారం.. సాధారణ పరీక్షలో విద్యార్థి పైతరగతులకు ప్రమోట్ కావడంలో విఫలమైతే మళ్లీ పరీక్ష రాసేందుకు వారికి కొంత సమయం ఇస్తారు. ఫలితాల ప్రకటన తేదీకి రెండు నెలల్లోపే మళ్లీ పరీక్ష నిర్వహిస్తారు.
