జర్నలిస్టుపై దాడి కేసులో సినీ నటుడు మోహన్బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్బాబుపై రాచకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. జల్పల్లి నివాసంలో మంచు మోహన్బాబు ఫ్యామిలీ వివాదం ఇటీవల రాష్ట్రంలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
