శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో నిర్మాణంలో ఉన్న అమర్ రాజా బ్యాటరీ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మూడో అంతస్తు నుంచి మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. అగ్ని ప్రమాదాన్ని గమనించిన ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాయి.
