ఈ ఏడాది సైబర్ నేరాలు 18% పెరిగాయని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ చెప్పారు. 2024లో సైబర్ క్రైమ్ కారణంగా 1,866 కోట్లు నష్టపోయామని, 176 కోట్లు రిఫండ్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ ఏడాది 1,14,000 ఫిర్యాదులు నమోదు కాగా, 24,643 FIRలు నమోదయ్యాయి. ఇక, దుబాయ్కు డబ్బులు క్రిప్టో రూపంలో వెళ్ళిపోతున్నాయని కూడా గోయల్ వెల్లడించారు.
