కాచిగూడ-చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ రైలులో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. దాంతో గద్వాల రైల్వేస్టేషన్లో చెన్నై ఎగ్మోర్ రైలును అధికారులు నిలిపివేశారు. అకస్మాత్తుగా రైలు ఎక్స్ప్రెస్ బోగీలో నుంచి దట్టంగా పొగలు వ్యాపించి… మంటలు చెలరేగాయి. దాంతో అధికారులు వెంటనే రైలును ఆపి.. ప్రయాణికులను దింపివేశారు. ప్రస్తుతం అధికారులు ఈఘటనపై విచారణ జరుపుతున్నారు.
