సినీ పరిశ్రమపై పగబట్టినట్లుగా తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. ‘‘సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మృతిని అందరూ ఖండించారు. శ్రీతేజ్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. మృతురాలి కుటుంబానికి అందరూ బాసటగా నిలిచారు’’ అని అన్నారు. ఈ సమస్య సద్దుమణికి వచ్చిన తర్వాత, అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడితో ప్రశ్న అడిగించి, సినిమా తరహా కథను అల్లుకొని కొత్త సమస్యను సృష్టించారని బండి సంజయ్ ఆరోపించారు.
