ఇటీవలే వచ్చిన మూవీ ‘అమరన్’ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి. ఈ మూవీ తెలుగు, తమిళంలో భారీ విజయాన్ని అందుకుంది. సాయి పల్లవి తాజాగా తన చెల్లితో కలిసి వెకేషన్ వెళ్లింది. చెల్లెలు పూజా కన్నన్, స్నేహితులతో కలిసి ఈ వెకేషన్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ‘ప్రేమించే వ్యక్తులతో ఒక అందమైన ప్రయాణాన్ని గుర్తుంచుకోవడానికి, సాహసం, ఒక చిన్న నవ్వు’ అనే క్యాప్షన్తో సాయి పల్లవి పలు ఫొటోస్ షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
